4.20 లక్షలు బిల్లులు చెల్లించిన వెల్లుల రైతులు
NEWS Dec 29,2024 05:16 pm
మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామ రైతులు వంద శాతం ఒకే రోజు తమ1340 వ్యవసాయ కనెక్షన్ల కస్టమర్ చార్జీలు ₹ 4.20 లక్షలు చెల్లించి జిల్లాలో ఆదర్శంగా నిలిచారు. గత 20 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్పీడీసీఎల్ జగిత్యాల జిల్లా ఎస్ఈ షాలియా నాయక్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమం రైతు శ్రేయస్సును దృష్టి లో పెట్టుకొని చేస్తుంటామని, రాబోయే వేసవి దృష్ట్యా కార్యాచరణ ప్రణాళిక రూపొందుతుందన్నారు.