జనజీవన స్రవంతిలో కలవాలంటూ కౌన్సిలింగ్
NEWS Dec 29,2024 07:46 am
కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన తిప్పిరి తిరుపతి గత కొద్ది సంవత్సరాల క్రితం దళంలో చేరారు. వారి కుటుంబ సభ్యులను మెట్ పల్లి డిఎస్పీ రాములు కలిసి అతనిని తిరిగి జనజీవన స్రవంతిలో కలవాలని కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేశారు. వారికి నిత్యవసర వస్తువులు అందించారు. ఇందులో కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.