జాగ్ భోగ్ బండార్ జాతరలో ఎమ్మెల్యే
NEWS Dec 29,2024 05:40 am
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్ తండాలో జాగ్ భోగ్ బండార్ జాతరను గిరిజనులు అత్యంత వైభవంగా, భక్తి శ్రద్దాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో గిరిజనులు ప్రతి ఏటా అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలకు 15 వేల మంది వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యారు.