ఖాకీల నిర్వాకం మంత్రి ఆగ్రహం
NEWS Dec 28,2024 07:27 pm
మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. పల్నాడు జిల్లా మాచర్లలో కానిస్టేబుల్, హోంగార్డులు కొట్టుకున్నారు. మద్యం మత్తులో హోంగార్డుపై దాడి చేశాడు ఏపీఎస్పీ కానిస్టేబుల్. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. వెంటనే ఘటనకు సంబంధించి ఆరా తీశారు . సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేయాలని స్పష్టం చేశారు.