కొండగట్టులో ధనుర్మాస ఉత్సవాలు
NEWS Dec 28,2024 02:14 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుశ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాస శనివారం సందర్భంగా ఉప ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ప్రతిష్టించిన గోదాదేవి ఉత్సవ మూర్తుల విగ్రహాలను ఆలయ అర్చకులు విశేషాలంకరణ గావించి, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ధూప దీప నివేదన మంగళహారతి, మంత్రపుష్పం తీర్థప్రసాదాల వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి సేవలో తరించారు.