కస్తూర్బా పాఠశాల విద్యార్థుల నిరసన
NEWS Dec 28,2024 11:28 am
కోరుట్ల మండలం కల్లూరు కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు సమ్మెకు వెళ్లడంతో అధికారులు తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కేటాయించారు. తమకు పాత ఉపాధ్యాయులతోనే బోధన జరిపించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ.పరీక్షలకు 2 నెలల సమయమే ఉందని, పాత ఉపాధ్యాయులతోనే బోధన జరిపించాలని అన్నారు.