నితీశ్ కుమార్ రెడ్డికి నజరానా
NEWS Dec 28,2024 10:02 am
మెల్ బోర్న్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి. కష్టాల్లో ఉన్న జట్టును ఒడ్డుకు చేర్చాడు. శతకంతో చెలరేగిన రెడ్డికి భారీ నజరానా ప్రకటించింది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్. ఈ మేరకు రూ. 25 లక్షలు ఇవ్వనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటించారు. సీఎం చేతులు మీదుగా అందజేస్తామన్నారు.