మన్మోహన్ సింగ్ అసాధారణమైన రాజకీయవేత్త
NEWS Dec 27,2024 04:36 am
డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఈ దేశం అరుదైన, అసాధారణమైన నాయకుడిని, రాజకీయవేత్తను, ఆర్థిక రంగ నిపుణుడిని కోల్పోయిందన్నారు. ఇది దేశానికే కాదు తమ పార్టీకి, అంతకు మించి తనకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఇలాంటి నేతలు అరుదుగా జన్మిస్తుంటారని అన్నారు . అత్యంత దూరదృష్టి కలిగిన నాయకుడని కితాబు ఇచ్చారు.