సెలవు ..7 రోజుల సంతాప దినాలు
NEWS Dec 27,2024 04:15 am
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప సూచకంగా శుక్రవారం సెలవు ప్రకటించింది. ఆయనకు నివాళిగా రాష్ట్రమంతటా ఏడు రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.