మన్మోహన్ సింగ్ కన్నుమూత
NEWS Dec 26,2024 07:24 pm
ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. ఆర్థిక సంస్కరణల సూత్రధారి, యూపీఏ కూటమికి ప్రధానిగా 2004-14 మధ్య పని చేశారు. 1991లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.