ఘనంగా సీపీఐ శత జయంతి ఉత్సవాలు
NEWS Dec 26,2024 11:37 am
సిపిఐ శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా కోరుట్లలోని సీపీఐ కార్యాలయం సి.ప్రభాకర్ భవన్లో సిపిఐ జెండాను నేతలు ఎగురవేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ.. నాటి నుంచి నేటి వరకు పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు ఎండీ మౌలానా కార్యకర్తలు ఉన్నారు.