శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు
NEWS Dec 26,2024 07:49 am
శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ రూమ్ లో టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయ్యారు. సినిమా రంగానికి తాము వ్యతిరేకం కాదని పూర్తిగా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. సంధ్య థియేటర్ ఘటన గురించి మరోసారి ప్రస్తావించారు, మహిళ చని పోవడం వల్లనే తాను చర్యలకు ఆదేశించానని చెప్పారు. బౌన్సర్ల విషయంలో కఠినంగా ఉంటామన్నారు.