మరోసారి అజ్ఞాతంలోకి మోహన్ బాబు
NEWS Dec 26,2024 06:16 am
జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మంచు మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో తనను అరెస్ట్ చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. తిరుపతి లోని శ్రీ విద్యా నికేతన్ నుంచి వెళ్లి పోయినట్లు సమాచారం. ఈనెల 16వ తేదీన హైదరాబాద్ నుంచి ఎవరికీ చెప్పకుండా బెంగళూరుకు వెళ్లారు. తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. కానీ చిక్కడం లేదు.