7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
NEWS Dec 26,2024 05:10 am
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకుని 7వతేదీ మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.