అటవీ భూమి చుట్టూ కందకం తవ్వకం
NEWS Dec 25,2024 04:51 pm
మనోహరాబాద్ మండలం రంగాయపల్లి శివారులోని అటవీ భూమికి అడ్డుగా కందకం తీశారు. మట్టి రవాణా చేస్తున్న భారీ వాహనాలు అటవీ భూముల నుంచి వెళ్తుండడంతో కందకం తీసి అడ్డుకున్నారు. తూప్రాన్ అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ అంబర్ సింగ్ ఆదేశాల మేరకు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి రోడ్డుకు అడ్డుగా కందకం తీసి, అటవీ భూముల నుంచి వాహనాలు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు.