Logo
Download our app
మల్కాపూర్ లో కొండచిలువ కలకలం
NEWS   Dec 23,2024 04:31 am
బీబీపేట మండలంలోని మల్కాపూర్‌ గ్రామంలో ఓ పొలంలోని బావి వద్ద కొండ చిలువ ఆదివారం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన గోవిందరాజు ఎప్పటిలాగే వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లగా కొండచిలువ కంటపడింది. వెంటనే అప్రమత్తమై చుట్టుపక్కల రైతులకు సమాచారం అందించగా వారు వచ్చి కొండచిలువను చంపేశారు. కొండచిలువ సుమారు రెండు మీటర్ల పొడవుతో 5 కిలోల బరువు ఉందని రైతు తెలిపారు. గతంలో సైతం ఇదే శివారులోని పలువురి పొలాల్లో కూడా కొండ చిలువలు కనిపించడంతో స్థానికులు చంపేశారు.
⚠️ You are not allowed to copy content or view source