గురుకులంను పట్టణానికి తరలించాలి
NEWS Dec 20,2024 06:30 am
మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో ఇప్పటికే 6గురు విద్యార్థులు పాముకాటుకు గురయ్యారు. ఇద్దరు చనిపోయారు. బాధ్యులుగా ప్రిన్సిపాల్లను మాత్రమే సస్పెండ్ చేస్తూ చేతులు దులుపు కుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పెద్దాపూర్ గురుకులంను సమీప పట్టణాలైన మెట్పల్లి లేదా కోరుట్ల పట్టణానికి తరలించాలని కోరుతున్నారు.