పెరుగుతున్న ఉల్లిధరలు
NEWS Dec 20,2024 05:52 am
నిజామాబాద్ జిల్లాలో ఉల్లి ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి.ఉల్లిపాయలు కోయకుండానే వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.ఉల్లి, వెల్లుల్లి ధరలు అమాంతం పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ ఉల్లి కిలో రూ.60 నుంచి రూ.70, వెల్లుల్లి కిలో రూ.360 నుంచి రూ.400 ధర పలుకుతోంది.డిమాండ్కు తగ్గట్టుగా ఉల్లిపాయల దిగుమతి లేకపోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని వినియోగదారులు అంటున్నారు.