సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
NEWS Dec 18,2024 01:52 pm
సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు బుధవారం మద్దతు ప్రకటించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు విద్యాశాఖలో ఎంతో కీలకమన్నారు. వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.