భారత్ కు తప్పిన ఫాలో ఆన్
NEWS Dec 17,2024 07:42 pm
బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు లో నాలుగో రోజు ఆట ముగిసింది. భారత్ స్కోరు 252/9. క్రీజులో జస్ప్రీత్ బుమ్రా (10), ఆకాశ్ దీప్ (27).పదో వికెట్కు 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 246 పరుగులు చేయడంతో భారత్ కు ఫాలో ఆన్ గండం తప్పింది. కాగా ఆసీస్ కంటే 193 పరుగుల వెనుకంజలో టీమిండియా ఉంది. పదే పదే వర్షం అడ్డంకిగా మారింది.