ఇందిరమ్మ ఇండ్ల సర్వే కలెక్టర్ తనిఖీ
NEWS Dec 17,2024 12:57 pm
మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. గ్రామంలోని పలు వార్డుల్లో ఇల్లు లేని నిరుపేదలు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు చేస్తున్న సర్వేను తనిఖీ చేసి, యాప్ ద్వారా సర్వే చేపట్టాలని సూచించారు. పూర్తి అర్హత గల నిరుపేద కుటుంబంలకు ఇళ్లను అందించే లక్ష్యంతో పని చేయాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో, ఎమ్మార్వో, ఎంపీడీఓ తదితరులు వున్నారు.