లగచర్ల రైతులపై అక్రమ కేసులపై బీఆర్ఎస్ నిరసన
NEWS Dec 17,2024 07:14 am
లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. జైళ్లలో నిర్బంధించి రైతుల చేతులకు బేడీలు వేసినా కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశంగా వ్యవహరించిందన్నారు. అమానవీయ అనచివేత విధానాల నిరసిస్తూ రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.