మహిళ మెడలో 3 తులాల నుంచి గొలుసు చోరీ
NEWS Dec 14,2024 05:28 pm
కామారెడ్డి: పట్టణంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి దుండగులు పుస్తెల తాడు అపహరించుకుని పారిపోయినట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అశోక్ నగర్ కు చెందిన భాగ్యమ్మ శనివారం కాలనీలోని కిరాణా షాపునకు నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.