తిరుమలలో భక్తుల రద్దీ
NEWS Dec 14,2024 03:35 am
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని 63,722 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,225 మంది తలనీలాలు సమర్పించారు. విరాళాలు, కానుకల రూపంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చింది. శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 9 గంటలకు పైగా సమయం పడుతుందని ఈవో వెల్లడించారు.