మంత్రిని కలిసిన MLA పైడి రాకేష్ రెడ్డి
NEWS Dec 13,2024 04:21 pm
ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండలంలోని నికాల్ పూర్,మారంపల్లి,వన్నెల్ కె, తల్వేదలకు సంబంధించిన ఎత్తిపోతల పథకాల మోటార్లకు మరమ్మత్తులు చేయించాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విన్నవించారు. శుక్రవారం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వద్ద సమీక్ష సమావేశానికి హాజరైన ఉత్తంకుమార్ రెడ్డిని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కాళేశ్వరం ప్యాకేజ్ లో భాగంగా పైప్ లైన్స్ వేయాలని ఎమ్మెల్యే కోరారు.