18న కలెక్టరేట్ వద్ద ధర్నా
NEWS Dec 13,2024 04:23 pm
రైతాంగ సమస్యల పరిష్కారం - వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులు కేటాయించాలని డిసెంబర్ 18న నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉదయం 11 గంటలకు ధర్నా ను విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుందని జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయి దీనివల్ల రైతుల సమస్యలు పరిష్కారం కాక అప్పులు పెరిగి రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పనీ చేయాలన్నారు.