సమగ్రన్యాయం చేయాలి: బాజిరెడ్డి
NEWS Dec 11,2024 03:51 pm
సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, వారికి న్యాయం చేయాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. బాజిరెడ్డి వారి వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రేవంత్ ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు.