నిజామాబాదులో జర్నలిస్టుల నిరసన
NEWS Dec 11,2024 02:02 pm
హైదరాబాద్లో కవరేజ్ సందర్భంగా జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులు హెచ్చరించారు. మోహన్ బాబుపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రతిరోజూ కవరేజీ సమయంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన, ప్రత్యేక ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, వీడియో జర్నలిస్ట్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.