పేర్ని నాని భార్యపై కేసు నమోదు
NEWS Dec 11,2024 11:21 am
రేషన్ బియ్యం అక్రమాల విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. సివిల్ సప్లై అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు బందరు తాలుకా పీఎస్ లో కేసు నమోదైంది. తన భార్య పేరిట ఉన్న గోడౌన్ లో రేషన్ బియ్యం స్టాక్ లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. భార్యపై ఫిర్యాదు చేయడంతో నానికి షాక్ తగిలింది.