Logo
Download our app
ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించాలి
NEWS   Dec 09,2024 01:00 pm
ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ తో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. విద్య, వైద్యం, ధరణి, పింఛన్లు, రెవెన్యూ, వ్యవసాయం తదితర సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source