తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడం తగదు
NEWS Dec 09,2024 05:46 am
తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. సీఎం ఆవిష్కరించడం బాధాకరమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతోందన్నారు. ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారని మండి పడ్డారు.