తిరుమలలో భక్తుల రద్దీ
NEWS Dec 09,2024 04:22 am
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని 73,107 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,721 మంది తలనీలాలు స్వామి వారికి సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.58 కోట్లు వచ్చింది. ప్రస్తుతం భక్తులు ఒక కపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారని, సర్వ దర్శనం కోసం 6 గంటల సమయం పడుతుందని వెల్లడించారు ఈవో.