ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలి
NEWS Dec 09,2024 02:38 am
రైతులు పండించిన ధాన్యం తడవకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు పర్యవేక్షించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ధాన్యపు రాశులు వర్షాలకు తడవకుండా సమీప రైసు మిల్లులకు తరలించాలని, అవసరమైన టార్పాలిన్లు సమకూర్చాలని అన్నారు.