బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మిద్దాం: CITU
NEWS Dec 08,2024 04:54 pm
కార్మికులు సంక్షేమం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందని CITU రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వి రమ అన్నారు. ఆదివారం నిజామాబాధ్ CITU జిల్లా కార్యాలయంలో జిల్లా వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక కార్మికలు, అసంఘటిత కార్మికులు లక్షలాది మంది ఉన్నారని తెలిపారు. వీరందరి సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, కార్మికుల హక్కుల కోసం పోరాటాలను చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐక్య కార్యాచరణ పోరాటం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.