విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించాలి
NEWS Dec 08,2024 10:57 am
విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి నూతన ఆవిష్కరణలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అన్నారు. నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో 2 రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్శిబిరం ముగిసింది. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాన్ని వినియోగించుకోవాలన్నారు. అనంతరం జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.