14న జాతీయ లోక్ అదాలాత్
NEWS Dec 08,2024 11:00 am
కామారెడ్డి జిల్లాలో ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డా. వీఆర్ఆర్ వరప్రసాద్ సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమావేశం నిర్వహించారు. కేసుల పరిష్కరం కోసం ఆయన సూచనలు ఇచ్చారు. సమావేశంలో అదనపు జిల్లా న్యాయమూర్తి లాల్సింగ్ శ్రీనివాస్నాయక్, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి టి.నాగరాణి, ప్రిన్సిపల్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, ఎస్పీ సింధు శర్మ పాల్గొన్నారు.