రూ. 79 పెంచి వెయ్యి పెంచామంటే ఎలా..?
NEWS Dec 07,2024 03:38 pm
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు.హోం గార్డులకు రూ. 79 పెంచి రూ. 1000 పెంచామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడే హోం గార్డులకు ప్రభుత్వ భీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. రూ. 20 వేలకు జీతం పెంచి, తరువాత వారికి పీఆర్సీ 30 శాతం పెంచిన ఘనత తమ నాయకుడు కేసీఆర్ కే దక్కిందన్నారు.