బావిలో దూకి మహిళ ఆత్మహత్య
NEWS Dec 07,2024 02:48 pm
ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామానికి చెందిన తెలుక౦టి శ్యామల (55) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. పదేళ్లుగా ఆమె మానసిక స్థితి బాగలేదన్నారు. ఎన్ని హాస్పిటల్స్లో చూపించిన ఆరోగ్యం మెరుగు పడడం లేదని మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఆమె భర్త నరసయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.