ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు
NEWS Dec 07,2024 12:17 pm
మోడీ కేంద్ర ప్రభుత్వం ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేసిందని వెల్లడించారు మంత్రి నారా లోకేష్ . అనకాపల్లి, వలసపల్లె, పాలసముద్రం, తాళ్లపల్లె, రొంపిచర్ల, నందిగామ, నూజివీడు, డోన్లో రానున్నాయని తెలిపారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటితో కలిపితే మొత్తం ఏపీలో 44 కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయని చెప్పారు.