జనవరి నుంచి జనంలోకి జగన్
NEWS Dec 07,2024 11:55 am
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టీడీపి కూటమి సర్కార్ పై యుద్దం ప్రకటించారు. హామీలను అమలు పర్చడంలో విఫలమైందని ఆరోపించారు. జనవరి మూడో వారం నుంచి జిల్లాలలో పర్యటిస్తానని ప్రకటించారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో బుధ, గురువారం నిద్ర చేస్తానని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మమేకం అవుతానని తెలిపారు.