800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం
NEWS Dec 07,2024 10:33 am
నల్లగొండ జిల్లా దామరచర్లలో 4000 మెగావాట్ల (5*800 mw) యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 800 మెగావాట్ల యూనిట్ - 2 ను శనివారం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ యూనిట్ ను జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. తాము ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.