యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోలీసులకు సన్మానం
NEWS Dec 07,2024 04:57 pm
మెట్ పల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్ నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిన విద్యార్థినిని క్షేమంగా ఇంటికి చేర్చిన మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై రాజును పలువురు అభినందించారు. యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. పిర్యాదు తీసుకున్న 24 గంటల్లో విద్యార్థిని తల్లిదండ్రులకి అప్పజెపడంతో బాలిక కథ సుఖాంతం అవ్వడంతో అందరం ఊపిరి పిల్చుకున్నట్లైందని అన్నారు. ఈ .కార్యక్రమంలో 7వ వార్డు ఇన్చార్జి.మహమ్మద్ జాకీర్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.