బాబూ అదానీపై విచారణ మాటేంటి..?
NEWS Dec 07,2024 08:22 am
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ సర్కార్ పై మండిపడ్డారు. రేషన్ బియ్యం స్కాంపై సిట్ వేశారని..మరి రూ. 1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై గౌతమ్ అదానీపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదంటూ నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు కామ్ గా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు.