అడుగుల పొడవున్న కొండచిలువ ప్రత్యక్షం
NEWS Dec 06,2024 05:00 pm
ఓకటి కాదు రెండు కాదు ఏకంగా 15 అడుగుల పొడవున్న కొండచిలువ నిజామాబాద్ జిల్లా మైలారం గ్రామంలో హల్ చల్ చేసింది.. దట్టమైన అడవుల్లో కనిపించే భారీ కొండచిలువ జననావాసాల మధ్యన ప్రత్యక్షమైంది..నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం అటవీ ప్రాంతాలకు పెట్టింది పేరు.. ఇక్కడ తరచుగా వన్యప్రాణులు పాములు జననావాసాల మధ్య కనిపిస్తుంటాయి. కానీ15 అడుగుల పొడవున్న కొండచిలువ ప్రత్యక్షం అవడంతో జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు. భయంతో పరుగులు తీశారు.