అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీ లభ్యం
NEWS Dec 06,2024 03:12 pm
మెట్ పల్లి పట్టణంలోని అదృశ్యమైన బాలిక ఆచూకీలభించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గురువారం నుండి గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం నిజామాబాద్ పట్టణంలోని ట్రాఫిక్ ఎస్సై సంజీవ్ ఆధీనంలో బాలిక ఉన్నట్టు ఆచూకీ తెలిసింది. సమాచారం అందుకున్న మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి తన బృందంతో నిజామాబాద్ చేరుకొని అమ్మాయిని మెట్ పల్లి తీసుకొని వస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..