పుష్ప-2 తొలి రోజు రూ. 294 కోట్లు
NEWS Dec 06,2024 01:25 pm
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైరెక్టర్ సుకుమార్ తీసిన పుష్ప-2 ది రూల్ మూవీ రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 294 కోట్లు వసూలు చేసిందని ప్రకటించారు దర్శకుడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా, శ్రీలీల, రావు రమేష్, ఫాజిల్, ప్రకాష్ రాజ్ నటించారు.