అసెంబ్లీ ముందు ఆందోళన చేస్తా
NEWS Dec 06,2024 01:16 pm
ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, రిటైర్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మాయ మాటలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. ఇచ్చిన ఆరు హామీలు గాలికి వదిలి వేశారని, సమస్యలు పరిష్కరించక పోతే అసెంబ్లీ ముందు ఆందోళన చేస్తానన్నారు.