విద్యార్ధులకు ఆన్ జాబ్ ట్రైనింగ్
NEWS Dec 06,2024 12:44 pm
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకేషనల్ విభాగం ఆఫీస్ అసిస్టెంట్ షిప్ కోర్సు విద్యార్థులు ఆన్ జాబ్ ట్రైనింగ్ లో భాగంగా మెట్ పల్లి ఎమ్మార్వో కార్యాలయంను సందర్శించారు. స్థానిక తహసిల్దార్ N. శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి విద్యార్ధులకు కార్యాలయంలో ఉన్న వివిధ విభాగాల పనితీరును గురించి వివరించారు. డిప్యూటీ తహసిల్దార్ రాజ్ మొహమ్మద్ , బి సెక్షన్ అధికారి లక్ష్మీ ప్రసన్న, రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఉమేష్ వివిధ రికార్డుల నిర్వహణ తీరును విద్యార్థులకు అవగాహన కల్పించారు.