రేపటి నుండి గ్రామ రెవెన్యూ సదస్సులు
NEWS Dec 05,2024 02:38 pm
మండపేట మండలంలోని 14 రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 6 నుండి జనవరి 8 వరకు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు మండపేట తహసీల్దార్ తేజేశ్వరరావు పేర్కొన్నారు. రీ సర్వే గ్రామ సభలో వచ్చిన అర్జీలు సిసిఆర్సి కార్డులు అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. చనిపోయిన పట్టాదారులను గుర్తించి మ్యుటేషన్ చేయించడం, భూ ఆక్రమణలు, టైటిల్ డీడ్ సమస్యలపై రైతులు నుండి దరఖాస్తుల ఆహ్వానిస్తామన్నారు.