మహాలక్ష్మి పథకంతో మహిళలకు లబ్ది
NEWS Dec 05,2024 02:32 pm
మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో మహిళలు ఎంతగానో లబ్ది పొందుతున్నారని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. పట్టణంలోని టీజీఎస్ఆర్టిసి బస్టాండ్ లో మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం అమలుపరచి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశం ఆమె పాల్గొన్నారు. ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు అన్ని రంగాలలో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు డిపో పరిధిలో 11.54 కోట్ల మంది ప్రయాణికులు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నట్లు తెలిపారు.